ETV Bharat / bharat

'వారి మన్ కీ బాత్ వినండి-పరీక్షలు వాయిదా వేయండి'

author img

By

Published : Aug 23, 2020, 12:32 PM IST

Updated : Aug 23, 2020, 12:50 PM IST

నీట్, జేఈఈ పరీక్షలు వాయిదా వేయాలని డిమాండ్ చేశారు కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ. లక్షలాది మంది విద్యార్థుల మన్ కీ బాత్ విని, సరైన పరిష్కారం చూపాలని కేంద్రాన్ని కోరారు.

listen-to-students-ke-mann-ki-baat-about-neet-jee-and-arrive-at-acceptable-solution-rahul-gandhi-urges-centre
'వారి మన్ కీ బాత్ వినండి-పరీక్షలు వాయిదా వేయండి!'

నేషనల్ ఎలిజిబిలిటి కమ్ ఎంట్రన్స్ టెస్ట్(నీట్), జాయింట్ ఎలిజిబిలిటి ఎగ్జామినేషన్ (జేఈఈ )పరీక్షలు వాయిదా వేయాలని కోరుకుంటున్న విద్యార్థుల మన్ కీ బాత్​ను కేంద్రం వినాలన్నారు కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ. కరోనా వేళ పరీక్షలకు హాజరు కాలేని వారి దీనస్థితిని అర్థం చేసుకుని పరిష్కారం చూపాలని కోరారు.

సెప్టెంబర్ 1-16 మధ్య జేఈఈ, సెప్టెంబర్ 13న నీట్ పరీక్ష నిర్వహించనున్నట్లు ప్రకటించింది నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ(ఎన్టీఏ). అయితే, కరోనా వేళ పరీక్షలు రాయలేని లక్షలాది మంది విద్యార్థుల ఆవేదనను వినాలని కేంద్రాన్ని విజ్ఞప్తి చేశారు రాహల్.

  • आज हमारे लाखों छात्र सरकार से कुछ कह रहे हैं। NEET, JEE परीक्षा के बारे में उनकी बात सुनी जानी चाहिए और सरकार को एक सार्थक हल निकालना चाहिए।

    GOI must listen to the #StudentsKeMannKiBaat about NEET, JEE exams and arrive at an acceptable solution.

    — Rahul Gandhi (@RahulGandhi) August 23, 2020 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

"ఈ రోజు లక్షలాది మంది విద్యార్థుల మనసులోని మాట కేంద్రం విని తీరాలి. వారు ఆమోదించగలిగే పరిష్కారం చూపాలి."

-రాహుల్ గాంధీ, కాంగ్రెస్ నేత

ఆమ్ ఆద్మీ పార్టీ నేత, దిల్లీ విద్యా శాఖ మంత్రి మనీష్ సిసోడియా కూడా శనివారం.. నీట్, జేఈఈ పరీక్షలను రద్దు చేయాల్సిందిగా కేంద్రాన్ని కోరారు.

ఇదీ చదవండి: 'ఉపాధి హామీ పెంచి.. ఆ పథకం అమలు చేయండి'

Last Updated : Aug 23, 2020, 12:50 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.